- మృతుడు మెదక్ జిల్లాకు చెందిన దోనిపూడి సాంబశివరావు(48)గా గుర్తింపు
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన నాగర్ కర్నూలు జిల్లా ఈగలపెంట పోలీసులు
శ్రీశైలం: శ్రీశైలం డ్యామ్ సమీపంలోని లింగాలగట్టు పాతాళగంగలోకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం పాతాళగంగ వద్ద నీటిలో మృతదేహం తేలియాడుతుంటే గమనించిన మత్యకారులు ఈగలపెంట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్దలానికి చేరుకున్న నాగర్ కర్నూలు జిల్లా ఈగలపెంట పోలీసులు మత్స్యకారుల సహాయంతో నీటిలో తేలియాడుతున్న మృతదేహన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు.
మృతుడు తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన దోనిపుడి సాంబశివరావు(48)గా పోలీసులు గుర్తించారు. మృతుడు గత నాలుగు రోజుల కిందట శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు వచ్చాడు. స్థానికంగా ఉన్న గౌరిశంకర్ లాడ్జిలో దిగాడు. రూమ్ నంబర్ 4 లో రూము అద్దెకు దిగిన ఇతను మూడు రోజుల కిందట శ్రీశైలం డ్యామ్ లింగాలగట్టు పాతాళగంగలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని బందువులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈగలపెంట పోలీసులు తెలిపారు.