
మియాపూర్, వెలుగు: అపార్ట్మెంట్ రెండో ఫ్లోర్ నుండి కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని భీమవరంలోని ఏఎస్ఆర్నగర్కు చెందిన పాతపాటి దేవి, శ్రీనివాసరాజు(53) నెల రోజుల క్రితం మియాపూర్ మయూరినగర్లోని దివ్యశ్రీ శక్తి అపార్ట్మెంట్లో నివాసం ఉండే తమ కుమార్తె రమ్య తేజశ్విని ఇంటికి వచ్చారు. వీరు అపార్ట్మెంట్ 5వ బ్లాక్లోని రెండవ ఫ్లోర్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తుండగా శ్రీనివాసరాజు ఇంట్లో నుండి కారిడార్లోకి వచ్చాడు.
ఇదే సమయంలో పెద్ద శబ్ధం రావడంతో ఇంట్లోని కుటుంబసభ్యులు బయటకు వచ్చి చూడగా శ్రీనివాసరాజు రెండవ ఫ్లోర్ కారిడార్ నుండి కిందపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు గాయాలతో ఉన్న శ్రీనివాసరాజును సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే శ్రీనివాసరాజు గత ఆరు నెలలుగా హైబీపీ, షుగర్తో భాదపడుతున్నాడని, అప్పుడప్పుడూ టెన్షన్ పడేవాడని, ఈ క్రమంలో రెండవ ఫ్లోర్ నుండి కింద దూకి ఉండొచ్చని కుటుంబసభ్యులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.