
- కిలోన్నర హెరాయిన్, 2.8 కిలోల పప్పీస్ట్రా, కిలో గంజాయి సీజ్
హైదరాబాద్సిటీ/షాద్నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ దాబాలో భారీగా డ్రగ్స్పట్టుబడ్డాయి. కిలోన్నర హెరాయిన్తోపాటు గంజాయి, పప్పీస్ట్రాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరిని అరెస్ట్చేశారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్సీపీ అవినాశ్మహంతి మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని మౌలసర్ కు చెందిన వికాస్ సాహు(26), సిటీలోని ధూల్పేటకు చెందిన సలీం, మహేశ్వరంకు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన గణపతి ఓ గ్యాంగ్గా ఏర్పడి కొన్నాళ్లుగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు.
వికాస్ సాహు 2019 నుంచి షాద్ నగర్ టోల్ గేట్ సమీపంలోని సంజు భాయ్ మార్వాడీ దాబాలో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. యజమాని సంజు భాయ్ గంజాయి తాగే అలవాటు ఉంది. వీరిద్దరూ దూల్పేటకు చెందిన సలీంతో కలిసి దాబాకు వచ్చే కస్టమర్లకు గంజాయి కూడా విక్రయించడం స్టార్ట్చేశారు. తక్కువ ధరకు గంజాయి తెచ్చి దాబాలో ఎక్కువ ధరకు అమ్మేవారు. ఈ క్రమంలోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి గంజాయి, ఓపీఎం, హెరాయిన్, పప్పిస్ట్రా తీసుకొచ్చి దాబాలో విక్రయిస్తున్నారు. 10 గ్రాముల ఓపీఎంను రూ.1,300కు కొని.. రూ.2వేలకు; గ్రాము హెరాయిన్ను రూ.12వేలకు కొని, రూ.15వేలకు విక్రయిస్తున్నారు. కాగా ఇటీవల దాబా యజమాని సంజు అనారోగ్యంతో మృతి చెందాడు.
అప్పటి నుంచి వికాస్ సాహు దాబాను నడిపిస్తున్నాడు. దాబాను డ్రగ్స్ విక్రయానికి అడ్డాగా మార్చాడు. వారం కింద రాజు, గణపతినుంచి డ్రగ్స్కొని దాబాలో అమ్మేందుకు సిద్ధం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 632 గ్రాముల ఓపీఎం, కేజీ గంజాయి, కిలోన్నర హెరాయిన్, 2.8 కిలోల పప్పి స్ట్రా, 89,700 నగదు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న డ్రగ్స్విలువ బయట మార్కెట్లో రూ.3.5 కోట్లు ఉంటుందని, వికాస్సాహుకు డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. ప్రెస్మీట్లో శంషాబాద్ డీసీపీ రాజేశ్, మాదాపూర్ ఎస్ఓటీ డీసీపీ శోభన్కుమార్, ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సంజయ్, విజయ్ పాల్గొన్నారు.