
శివ్వంపేట, వెలుగు: సైబర్నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.2.26 లక్షలు కాజేశారు. ఎస్సై మధుకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలంలోని ఎదుల్లాపూర్ కు చెందిన మేకల చంద్రశేఖర్ రెడ్డి ఫోన్కు 5 నెలల క్రితం ఓ లింక్వచ్చింది. దాన్ని ఓపెన్ చేయడంతో రూ.500 పెట్టుబడి పెడితే రెట్టింపు ఇస్తామని నమ్మించారు. తొలుత కొంత డబ్బు పెడితే రెట్టింపు వచ్చింది. దీంతో అతను విడతల వారీగా రూ.2.26 లక్షలు పెట్టాడు.
తర్వాత డబ్బులు రాకపోవడం, అవతలి వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రశేఖర్రెడ్డి అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్ల అకౌంట్కు వెళ్లిన డబ్బుల్లో రూ.18 వేలను హోల్డ్ లో పెట్టామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.