రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే మృతి

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే మృతి

హైదరాబాద్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ముందు 48 సంవత్సరాల రాంచందర్ అనే వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటుగా వేగంగా వచ్చిన మారుతీ కారు రాంచందర్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన రాంచందర్.. ప్రమాదస్థలంలోనే మృతిచెందాడు. వాహనదారుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు.. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.