ఢిల్లీలో ప్రియురాలిని 35 ముక్కలు చేసి రోజుకో పార్ట్ పడేశాడు

ఢిల్లీలో ప్రియురాలిని 35 ముక్కలు చేసి రోజుకో పార్ట్ పడేశాడు

ఢిల్లీలోని మెహ్రౌలీలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని దారుణంగా హత్యచేశాడు ప్రియుడు. ఆమెను 35 ముక్కలు చేసి.. ఫ్రిడ్జ్ లో దాచి 18 రోజులపాటు రోజూ ఒక పార్ట్ ను తీసి అర్థరాత్రి  ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసి వచ్చాడు.  6 నెలల తర్వాత అసలు విషయం బయటపడింది. 

పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైలో ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తున్న శ్రద్ధకు నిందితుడు అఫ్తాబ్ కు పరిచయం ఏర్పడింది. వారి ప్రేమ కాస్త లివ్ ఇన్ రిలేషన్ దాకా వెళ్లింది. శ్రద్ధ పేరెంట్స్ లివ్ ఇన్ రిలేషన్ ను అంగీకరించలేదు. దీంతో శ్రద్ధ, అఫ్తాబ్ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. మెహ్రౌలీలో ఫ్లాట్ తీసుకుని రిలేషన్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే శ్రద్ధ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఓ రోజు ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో  అఫ్తాబ్ ఆమెను హత్య చేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అఫ్తాబ్ ను అరెస్ట్ చేశారు.  పోలీసులు అతడిని  కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 5 రోజుల పాటు  కస్టడీకి అనుమతిచ్చింది.