బాలిక శవంతో శృంగారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి

బాలిక శవంతో శృంగారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి

బాలికను పూడ్చిన మరుసటి రోజే ఘాతుకం
ఇటీవలే జైలు నుంచి విడుదలయిన నిందితుడు

అస్సాంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన బాలిక శవంతో శృంగారం చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడో వ్యక్తి. ఈ ఘటన అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని సిలాపాథర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ధేమాజీ జిల్లాలోని డెమెగావ్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక మే 17న అనుమానాస్పదంగా మృతిచెందింది. బాలిక కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని సిమెన్ నది ఒడ్డున పూడ్చి పెట్టారు.

మరుసటి రోజు మే 18న మధ్యాహ్నం వేళ 50 ఏళ్ల వ్యక్తి బాలిక మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీశాడు. ఆ తర్వాత బాలిక మృతదేహంపై రేప్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బాలిక సమాధి నది పక్కనే ఉండటంతో.. అక్కడే ఉన్న జాలర్లు ఆ ఘటనను చూసి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల దర్యాప్తులో ఆ వ్యక్తి అకాన్ సైకియాగా గుర్తించారు. అతను సమాధిని తవ్వి, మృతదేహంతో శృంగారంలో పాల్గొనాలనే ఉద్దేశంతో శవాన్ని బయటకు తీసినట్లు నిందితుడు పోలీసు అధికారులకు తెలిపాడు. పోలీసులు సైకియాను అరెస్టు చేసి.. అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 377, పోక్సో యాక్ట్ సెక్షన్ 8 కింద సిలాపాతర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ధెమాజీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ధనంజయ్ ఘనావత్ తెలిపారు. సైకియాపై ఆయన భార్య 2018లో కేసు పెట్టిందని.. ఆ కేసుకు సంబంధించి సైకియా జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి వల్ల ఖైదీలను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం… సైకియాను ఇటీవలే జైలు నుంచి విడుదల చేసినట్లు ధెమాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రదీప్ కొన్వర్ తెలిపారు.

For More News..

వన్డేల్లో కోహ్లీ కంటే సచిన్ బెస్ట్

స్వామి గౌడ్ మృతిపట్ల కిషన్ రెడ్డి సంతాపం

తండ్రిని సైకిల్‌పై 1200 కిలోమీటర్లు తీసుకెళ్ళిన బాలికకు బంపర్ ఆఫర్