జోగులళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల తహసీల్దార్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయంలోని పలు ఫైళ్లు, కీలక రికార్డులు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. తహసీల్దార్ ఆఫీసులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫైర్ యాక్సిడెంట్ లో పలు కీలకమైన ఫైళ్లు దగ్ధం అయినట్లు ప్రచారం జరుగుతుండటం స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన సమాచారం తెలిసి కూడా అధికారులు వెంటనే ఆఫీసుకు రాకపోవడం మరింత బలం చేకూర్చుతోందంటున్నారు. అగ్నిప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.