అది ఆ స్నేక్ బ్యాచ్ పనే.. వైరలవుతున్న మంచు విష్ణు కామెంట్స్

అది ఆ స్నేక్ బ్యాచ్ పనే.. వైరలవుతున్న మంచు విష్ణు కామెంట్స్

మంచు విష్ణు(Manchu Vishnu)  తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప(Kannappa)' సినిమాను మొదలుపెట్టేశాడు. ఆగస్టు 18న శ్రీకాళహస్తిలో లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. సింగల్ షెడ్యూల్ లో పూర్తికానున్న ఈ సినిమాను మహా భారతం సిరీస్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) తెరకెక్కించనున్నారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుంది ఈ సినిమాలో.. నురూప్ సనన్(Nurup sanon) హీరోయిన్ గా నటిస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మోహన్ బాబు(Mohan babu) నిర్మాతగా వ్యవహిస్తున్నారు. 

ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు తనపై, తన కుటుంబం పై వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందించారు. ఈ క్రమంలో సంచలన కామెంట్స్ చేశారు మంచు విష్ణు. మా ఎలక్షన్స్ ముందు వరకూ నాపై పెద్దగా ట్రోలింగ్ జరిగేది కాదు. ఎప్పుడైతే నేను మా ఎలక్షన్స్‌ లో పోటీ చేస్తున్నాను అని ప్రకటించానో అప్పటినుండి ఈ ట్రోలింగ్  చేయడం ప్రారంభించారు. అది ఎవరు చేయించారో, దాని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడు ఎందుకు అంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.