ఆదరాబాదరగా జిల్లాల్లో కలిపిర్రు.. వెంటనే మార్చండి : పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఆదరాబాదరగా జిల్లాల్లో కలిపిర్రు.. వెంటనే మార్చండి : పల్లా రాజేశ్వర్ రెడ్డి

జిల్లాల పునర్విభజన చేసేప్పుడు ఆదరాబాదరగా మండలాలను కలిపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. చేర్యాల ప్రజలు నియోజకవర్గ సమస్యలకు జనగామ, రెవెన్యూ సమస్యకు సిద్ధిపేట, వ్యవసాయ గజ్వేల్, పోలీస్ సమస్యలకు హుస్నాబాద్ వెళ్లాల్సి వస్తుందని అన్నారు.  

అప్పుడు ఆదరాబాదరగా మండలాలను జిల్లాల్లో కలిపారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాలలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఉంది కాబట్టి అక్కడ కొంత మంది అధికారులను నియమించి ఉంచాలని కోరారు. జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కాన్ కరాబ్ అయ్యిందని దాన్ని రిపేర్ చెయిద్దామంటే కావట్లేదని అని తెలిపారు. మా రిక్వెస్ట్ తో కొత్తది  తీసుకురావాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు.  

Also read : BRS పార్టీకి వికారాబాద్ జడ్పీ చైర్మన్ రాజీనామా