ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి కృషి : జీఎం ఎన్.రాధాకృష్ణ

ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి కృషి :  జీఎం ఎన్.రాధాకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం కృషి చేస్తోందని సంస్థ మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం మందమర్రిలోని తన ఆఫీస్​లో పర్సనల్​డిపార్ట్​మెంట్​రివ్యూ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల గైర్హాజరు శాతం తగ్గితే బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. అనంతరం హెల్త్​కార్డులు, ఇతర అంశాలపై చర్చించారు.

హెచ్ఆర్​డీ జీఎం సందర్శన..

మందమర్రి ఏరియా జీఎం ఆఫీస్​ను శుక్రవారం సింగరేణి కార్పొరేట్ మావన వనరుల(హెచ్ఆర్​డీ) జీఎం వెంకటరమణారెడ్డి సందర్శించారు. హెచ్ఆర్​డీ విభాగానికి సంబంధించిన అంశాలపై జీఎం రాధాకృష్ణ, సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ నెల 31న జీఎం వెంకటరమణారెడ్డి ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో ఆయనను సన్మానించారు.

 సింగరేణిలో వివిధ హోదాల్లో పని చేసిన వెంకటరమణారెడ్డి మానవ వనరుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఏరియా ఎస్​వోటూ జీఎం విజయప్రసాద్, కేకే ఓసీపీ పీవో మల్లయ్య, పర్సనల్ మేనేజర్​ శ్యాంసుందర్, ఐఈడీ ఎస్ఈ కిరణ్​కుమార్, వీటీసీ మేనేజర్ శంకర్, పర్ఛేజ్​ఆఫీసర్ బాబు, సీనియర్​ పీవోలు సందీప్, కార్తీక్, అన్ని గనులు, డిపార్ట్ మెంట్ల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.---