బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం.. మంత్రి వివేక్ వెంకటస్వామి

బీసీలకు న్యాయం జరిగే  వరకు పోరాడతాం.. మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా మందమర్రిలో  బీసీ రిజర్వేషన్​ కు మద్దతుగా జరిగిన బంద్​ లో మంత్రి వివేక్​ వెంకటస్వామి పాల్గొన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్​చేసినా.. కేంద్రం అడ్డుకుంటుందన్నారు మంత్రి వివేక్​.  కాంగ్రెస్​ తోనే బీజీలకు న్యాయం జరుగుతుందన్న మంత్రి.. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. రాహుల్​ జోడో యాత్రలో బీసీల సమస్యలు గుర్తించారన్నారు.  బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బీసీ బంద్​కు అన్ని పార్టీలుమద్దతు పలికాయన్నారు. 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో‌ బీసీ సంఘాలు   బస్టాండ్  ముందు అందోళనకు దిగారు.  బస్ డిపో ముందు బైఠాయించిన నిరసన తెలిపారు.42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని  డిమాండ్ చేశారు. బస్సులు  ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.