కేటీఆర్పై పరువు నష్టం దావా వేసిన మాణిక్యం ఠాగూర్

 కేటీఆర్పై  పరువు నష్టం దావా వేసిన మాణిక్యం ఠాగూర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పరువు నష్టం దావా నోటీసులు పంపారు ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు మాణిక్యం ఠాగూర్. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్యం ఠాగూర్ పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు.