
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. అవినీతిని ఆధారాలతో ప్రజలకు వివరించాలని ఆదేశించారు. బుధవారం గాంధీ భవన్లో పీసీసీ అధికార ప్రతినిధులతో ఠాక్రే సమావేశమయ్యారు.
అన్ని రకాల సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, డిక్లరేషన్లు, గ్యారెంటీలను ప్రజల కు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మీడియా కమిటీ చైర్మన్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.