బీఆర్ఎస్, బీజేపీ అవినీతిని ప్రజలకు వివరించండి: మాణిక్రావ్ ఠాక్రే

బీఆర్ఎస్, బీజేపీ అవినీతిని ప్రజలకు వివరించండి: మాణిక్రావ్ ఠాక్రే

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ అధికార ప్రతినిధులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావ్​ ఠాక్రే సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. అవినీతిని ఆధారాలతో ప్రజలకు వివరించాలని ఆదేశించారు. బుధవారం గాంధీ భవన్​లో పీసీసీ అధికార ప్రతినిధులతో ఠాక్రే సమావేశమయ్యారు.

అన్ని రకాల సోషల్​ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్​ మీడియాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ మేనిఫెస్టో, డిక్లరేషన్లు, గ్యారెంటీలను ప్రజల కు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్, మీడియా కమిటీ చైర్మన్​ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.