ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి గీతాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న గీతాదేవి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
గీతాదేవికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గతేడాది అక్టోబర్లో మనోజ్.. తన తండ్రి ఆర్కె బాజ్పేయిని కోల్పోయాడు. మనోజ్ బాజ్పేయి ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.