- ఇద్దరు అరెస్ట్
- 2 క్వింటాళ్ల టీ పొడి స్వాధీనం
అల్వాల్, వెలుగు : నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన పరీష్, బాలానగర్ కు చెందిన పద్మ ఇద్దరూ కలిసి అల్వాల్ లో రూమ్ ను రెంట్ కు తీసుకున్నారు. కొంతకాలంగా నకిలీ టీ పొడి తయారు చేస్తూ స్థానిక దుకాణాల్లో అమ్ముతున్నారు.
దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేశారు. 2 క్వింటాళ్ల నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. పరీష్, పద్మను అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.