బ్రహ్మోత్సవాలకు మన్యంకొండ ముస్తాబు

బ్రహ్మోత్సవాలకు మన్యంకొండ ముస్తాబు

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా మంచినీటి సౌకర్యం, పార్కింగ్ తో పాటు ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు అలివేలు మంగ దేవాలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. పనులను త్వరగా పూర్తి చేస్తామని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్  తెలిపారు.