నారాయణ్ పూర్లో మావోయిస్టుల డంప్.. రూ.24 లక్షల క్యాష్, ఆయుధాలు స్వాధీనం

నారాయణ్ పూర్లో మావోయిస్టుల డంప్.. రూ.24 లక్షల క్యాష్, ఆయుధాలు స్వాధీనం

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని నారాయణ్​పూర్​జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను శుక్రవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని ఓర్చా పోలీస్​స్టేషన్​టేక్లా అటవీ ప్రాంతలో భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. డంప్ కనిపించింది.

ఇందులో ఇన్సాస్​రైఫిల్, రెండు మేగజైన్లు, 21 ఇన్సాస్​రౌండ్లు, రెండు ఎస్​ఎల్​ఆర్​లు, నాలుగు మ్యాగజైన్లు, 63 రౌండ్లు, రెండు 303 రైఫిల్స్, 65 రౌండ్స్, ఓసీ రౌండ్లు, 30 ఓసీ మేగజైన్లు, బీజీఎల్​ లాంచర్, సింగిల్​షాట్​గన్​, మూడు డిటోనేటర్లతో పాటు రూ. 24 లక్షలు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకొని నారాయణ్ పూర్ జిల్లా కేంద్రానికి తరలించినట్లు బలగాలు తెలిపాయి.