టీఆర్ఎస్​ కేడర్​కు నక్సల్స్ వార్నింగ్

టీఆర్ఎస్​ కేడర్​కు నక్సల్స్ వార్నింగ్
  • ఎన్​కౌంటర్లకు సర్కారుదే బాధ్యత
  • మావోయిస్టు ఏరియా సెక్రటరీ పాపన్న

నర్సంపేట, వెలుగు: ఎన్​కౌంటర్లకు టీఆర్ఎస్​గవర్నమెంట్​ బాధ్యత వహించాలని, ఆ పార్టీ కేడర్​ను వదిలిపెట్టబోమని సీపీఐ మావోయిస్టు ఇల్లెందు –- నర్సంపేట ఏరియా కమిటీ సెక్రటరీ పాపన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామ్రాజ్యవాద, కార్పొరేట్ ​సంస్థల ప్రయోజనాల కోసం, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి ప్రజా ఉద్యమాలపై దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ సెక్రటరీ శాంత, ఇల్లెందు -నర్సంపేట ఏరియా దళ కమాండర్ ​బుచ్చన్న, కైలాశ్​ పోలీసులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఎన్​కౌంటర్లు లేని తెలంగాణ అన్న కేసీఆర్​ నిత్యం ఎన్​కౌంటర్లతోనే పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. వెంకటాపురం అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​ను నిరసిస్తూ ఈ నెల 22న తలపెట్టిన బంద్​లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు.