తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టుల విధ్వంసం

తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టుల విధ్వంసం

తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరు మండలంలోని సరివెల గ్రామ సమీపంలోని వెంకట్రామపురం దగ్గర విధ్వంసానికి పాల్పడ్డారు. చంద్రవంక వాగు పై రహదారి, బ్రిడ్జి నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న 2 ట్రాక్టర్లు, 2 జేసీబీ ప్రొక్లైన్లు, 1 ఐషర్, ఒక లారీ తో పాటు మిల్లర్లులను మావోయిస్టులు తగలబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టుల కోసం చుట్టు పక్క గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.