పాపులర్ మోడల్ ఆల్టో అమ్మకాలు 40 లక్షల యూనిట్లను దాటాయని మారుతి సుజుకీ ప్రకటించింది. ఈ మోడల్ను 20 ఏళ్ల కిందట కంపెనీ లాంచ్ చేసింది. గత రెండు దశాబ్దాల నుంచి కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు ఆల్టో మోడల్ అప్గ్రేడ్ అవుతోందని మారుతి సుజుకీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ‘గత 16 ఏళ్ల నుంచి ఇండియాలో ఎక్కువగా అమ్ముడు పోయే మోడల్గా ఆల్టో నిలుస్తోంది’ అని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ఆల్టోను 2000 వ సంవత్సరంలో మారుతి తీసుకొచ్చింది. 10 లక్షల యూనిట్ల సేల్స్ మార్క్ను 2008 లో దాటిన ఈ మోడల్, 20 లక్షల యూనిట్ల సేల్స్ను 2012 లో, 30 లక్షల యూనిట్ల సేల్స్ను 2016 లో క్రాస్ చేసింది. ఇండియన్ మార్కెట్తో పాటు ఈ మోడల్ను 40 దేశాలలో మారుతి అమ్ముతోంది.