గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు 

గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు 

అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం అటవీ ప్రాంతం తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢ మాసం సమీపిస్తుండటం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. ఆదివారం ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఆలయానికి తెలంగాణలోని ఆయా ప్రాంతాల నుంచే కాకుండా ఏపీలోని పలు జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.