మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..400​ ఇంజెక్షన్లు సీజ్

మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..400​ ఇంజెక్షన్లు సీజ్

రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. మైలార్​దేవ్​ పల్లిలో డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టేపల్లి, దుర్గానగర్​చౌరస్తా వద్ద  ఇద్దరు డ్రగ్స్​ విక్రయిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వారిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితులు జిమ్​ ట్రైనర్​ నితీష్​, రాహుల్, సోహెల్​లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 400 మెఫెంటెర్మైన్​ సల్ఫేట్​ ఇంజక్షన్​లను సీజ్​ చేశారు. పట్టుబడ్డ ఇంజక్షన్స్​ ఎక్కడి నుంచి తెస్తున్నారు, ప్రధాన సూత్రదారి ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.