ఉద్యోగాల పేరుతో కోట్లకు టోకరా

ఉద్యోగాల పేరుతో కోట్లకు టోకరా

హైదరాబాద్: డీఆర్డీఏలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి కోట్ల రూపాయల టోకరా వేశాడు. వివరాలు.. వనస్థలిపురంలోని శరద్ నగర్ కు చెందిన రాయబారి సాయినాథ్ అనే వ్యక్తి సుమారు 60 మందికి డీఆర్డీఏలో జాబ్స్ ఇప్పిస్తానని నమ్మించాడు. వారి నుంచి సుమారు రూ.3 కోట్లు వసూల్ చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు నిందితుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాయినాథ్ ఇంట్లో డీఆర్డీఎల్ కు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్,రబ్బర్ స్టాంప్స్, నకిలీ ఐడీ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.