రూ.10 లక్షలు, 110 తులాల బంగారం లూటీ

రూ.10 లక్షలు, 110 తులాల బంగారం లూటీ

హైదరాబాద్ : నగరంలోని రాయదుర్గంలోని ఓ ఇంట్లో  చోరీ జరిగింది. రాయదుర్గంలోని టెలికాంనగర్ లో గోవిందరావు ఇంట్లో రూ. 10 లక్షలు, 110 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని గోవిందరావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లినప్పుడు.. నేపాల్ కు చెందిన వాచ్ మెన్ దంపతులు లక్ష్మణ్, పవిత్ర ఈ చోరికి పాల్పడ్డారు. దీంతో ఇంటి యజమాని గోవిందరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వాచ్ మెన్ దంపతులు పరారీలో ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు నెలలుగా గోవిందరావు ఇంట్లో వాచ్మెన్ గా పని చేస్తున్నారు.