
Mayasheel Ventures IPO: జూన్ మాసంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టిన అనేక ఐపీవోలు పెట్టుబడిదారులకు మంచి రాబడులను తెచ్చిపెట్టాయి. దాదాపు 95 శాతం లిస్టెడ్ ఐపీవోలు మంచి రాబడులను అందించటంతో ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నారు. అయితే రాబోయే కొన్ని నెలల వరకు కూడా ఇదే తరహా రష్ కొనసాగుతుందని తెలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మాయాషీల్ వెంచర్స్ కంపెనీ ఐపీవో గురించే. నేడు మార్కెట్లో లిస్టింగ్ అయిన ఐపీవో 23.40 శాతం ప్రీమియం ధర రూ.58 వద్ద జాబితా అయ్యాయి. లిస్టింగ్ తర్వాత కూడా పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ కొనసాగటంతో షేర్లు మరింతగా పెరిగి రూ.60కి చేరుకున్నాయి. ఇది వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో నిర్థేశించిన ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధర రూ.47 కంటే ఎక్కువ.
ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈలో జాబితా అయ్యాయి. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 3వేల షేర్లుగా నిర్ణయించింది. దీంతో లాట్ కొనుగోలు కోసం ఇన్వెస్టర్లు కనీసం రూ.లక్ష 41వేలు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల బెట్టింగ్ కోసం ఈ నెల 20 నుంచి 24 వరకు అందుబాటులో ఉంచబడింది. కంపెనీ తాజా ఐపీవో ప్రక్రియ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.27 కోట్ల 28 లక్షలను విజయవంతంగా సమీకరించింది.
మాయాశీల్ వెంచర్స్ సంస్థ 2008లో స్థాపించబడింది. ఈ కంపెనీ NHIDCL, ఇతర ప్రభుత్వ విభాగాల కోసం రోడ్లు, హైవేలను నిర్మిస్తుంది. ఈ కంపెనీ ఎక్స్ప్రెస్వేలు, హైవేలు, ఫ్లైఓవర్లు, వంతెనలు వంటి ప్రాజెక్టుల నిర్మాణం, మార్పు, అభివృద్ధి వ్యాపారంలో నిమగ్నమై ఉంది. కంపెనీ ఇతర నిర్మాణ పనులను కూడా చేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.