ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ నిలిపివేస్తూ జారీ చేసిన సర్క్యులర్ను తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు.
ఇప్పటికే చాలీచాలని జీతాలతో, పెరిగిన పనిభారంతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఉన్న రాయితీలను తొలగించడం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి ఈ సర్క్యులర్ను రద్దు చేయాలని బుధవారం ఆయన కోరారు.
