రైతులకి మద్దతు ధర వచ్చేలా చర్యలు : ఎర్రబెల్లి

రైతులకి మద్దతు ధర వచ్చేలా చర్యలు : ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ జిల్లా : పండించిన ప్రతి పంటకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  ఇబ్బందులు రాకుండా వరి ధాన్యాన్ని ఎండబెట్టి తీసుకురావలని రైతులకు సూచించారు.

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 13వేల కోట్ల రూపాయలతో వరి ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. పత్తిని కేంద్రమే కొనాల్సి ఉన్నా…. ఇంకా మొదలు పెట్టలేదన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల పాలు చేయవద్దనీ.. మంత్రి రైతులకు సూచించారు.