
మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మంగళవారం మెదక్కలెక్టరేట్లో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 7న బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రార్థన స్థలాలను శుభ్రంగా ఉంచాలన్నారు. గోవుల అక్రమ రవాణా నివారణ, బందోబస్తు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
మెదక్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఏఎస్పీ మహేందర్, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటయ్య, డీఎస్పీ ప్రసన్న కుమార్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారం కోసమే..
పెండింగ్లో ఉన్న భూసమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని బోడగట్టు, షాబాద్ తండా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.