మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్ టౌన్, వెలుగు:   జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా  నవంబరు 30   వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్​ యాక్ట్​  అమలులో ఉంటుందని మెదక్​  ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు తెలిపారు.  బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

 పోలీసుల అనుమతి లేకుండా  ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్​ మీటింగ్​లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు.  అలాగే ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు.  ఈ విషయంలో జిల్లా ప్రజలు,  ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ శ్రీనివాస్​ రావు  కోరారు.