అభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ : పద్మాదేవేందర్ రెడ్డి

అభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ : పద్మాదేవేందర్ రెడ్డి
  •     ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

పాపన్నపేట, వెలుగు : అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలుస్తోందని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అన్ని జిల్లాలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.

అనంతరం పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఆమె సన్మానించారు.  కార్యక్రమంలో ఏడుపాయల చైర్మన్ బాల గౌడ్, ఏఎంసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు గడిల శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.