మేడారం హుండీ లెక్కింపు: రికార్డు బ్రేక్

మేడారం హుండీ లెక్కింపు: రికార్డు బ్రేక్

వరంగల్ అర్బన్: ఈ ఏడాది మేడారం జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తల్లి దర్శనానికి వచ్చిన భక్తులు మెక్కులు తీర్చుకుని హుండీలో కానుకలు సమర్పించుకున్నారు. ఆ హుండీల్లో భక్తులు వేసిన కానుకల లెక్కింపు ఏడు రోజులగా హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జరుగుతోంది. ఇప్పటికే హుండీ ఆదాయం పాత రికార్డులను బ్రేక్ చేసింది. రికార్డు స్థాయిలో 2018 జాతర సందర్భంగా 10 కోట్ల 17లక్షల 50వేల 363 రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. ఈ సారి ఇప్పటికే దాన్ని మించి పోయింది. ఇప్పటి వరకు 10కోట్ల 29 లక్షల 92 వేల రూపాయలు లెక్కించారు. మొత్తం 494 హుండీలు ఉండగా..  7వ రోజుకు 420 హుండీల్లో లెక్కింపు ముగిసింది. ఇంకా మిగిలి ఉన్న వాటిని లెక్కించగానికి మరో రెండ్రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.