మేడారం జాతర: కొలువుదీరిన అమ్మవార్లు

మేడారం జాతర: కొలువుదీరిన అమ్మవార్లు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. గద్దెలపై పగిడిద్దరాజు,సారలమ్మ, గోవిందరాజులు కొలువుదీరారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న పడిగిద్ద రాజుల రాక కొద్దిగా ఆలస్యమైందన్నారు ఎమ్మెల్యే సీతక్క. కాలినడకన వాగులు, గుట్టలు దాటుకుని, ట్రాఫిక్ లో వచ్చేసరికి లేటైందన్నారు.  జాతరకు కుంటుంబ సమేతంగా అందరూ కలిసి రావాలన్నారు.

అమ్మవార్ల దర్శనానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఇంచార్జ్ కలెక్టర్ కర్ణన్. దర్శనానికి స్పెషల్ క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ఇంచార్జ్ కలెక్టర్ కర్ణన్.