ప్లాస్టిక్ సంచిలో బాలిక మృతదేహం – తండ్రే హంతకుడు

ప్లాస్టిక్ సంచిలో బాలిక మృతదేహం – తండ్రే హంతకుడు

ప్లాస్టిక్ సంచిలో అనుమానాస్పదస్థితిలో పడి ఉన్న బాలిక డెడ్ బాడీ కేసు మిస్టరీని మేడ్చల్ పోలీసులు చేధించారు. బాలిక కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడినట్టు  తేలింది. బాలికపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత అతి దారుణంగా అంతమెందించినట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళితే.. శనివారం మధ్యాహ్నం మేడ్చల్ పట్టణంలోని కిందిబస్తీలో ఇండ్ల మధ్య ఉన్న చెత్తకుప్పలో ప్లాస్టిక్ సంచిలో డెడ్ బాడీ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. డెడ్ బాడీని పరిశీలించి మైనర్ బాలికగా గుర్తించారు.  మైనర్ బాలికపై ఎవరో యాసిడ్ పోసి దారుణంగా హత్య చేసి..శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇలా చెత్తకుప్పలో పడేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

దర్యాప్తు చేపట్టిన సీఐ గంగాధర్ ఆ ప్రాంతంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేశారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, వర్షం పడటంతో డాగ్‌స్వ్కాడ్‌ సైతం నిందితుల జాడ పసిగట్టకపోయాయి. పోలీసులకు అనుమానం వచ్చి బాలిక తండ్రిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నిందితుడికి ఇద్దరు భార్యలు ఉన్నట్లు, మృతి చెందిన బాలిక అతని మొదటి భార్య కూతురని పోలీసులు గుర్తించారు.