భద్రాచలంలో 8 హాస్పిటళ్ల సీజ్

భద్రాచలంలో 8 హాస్పిటళ్ల సీజ్

భద్రాచలం, వెలుగు:  భద్రాచలం పట్టణంలోని హాస్పిటల్స్​, ల్యాబ్​లపై   మెడికల్​ అండ్​ హెల్త్​ ఆఫీసర్లు శుక్రవారం దాడులు చేశారు.  ఇటీవల ఆర్టీసీ బస్టాండ్ ​సమీపంలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో షార్ట్ సర్క్యూట్ తో పొగలు కమ్ముకుని సేఫ్టీ రూల్స్​ పాటించకపోవడంతో పేషెంట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు.  

ఈ నేపథ్యంలో కలెక్టర్​ఆదేశించిడంతో డీఎంహెచ్ వో శిరీష  నేతృత్వంలో ఏడు టీమ్​లు  హాస్పిటల్స్​, ల్యాబ్​లపై దాడులు చేశారు.  సౌలతులు, సేఫ్టీ ఎక్విప్​మెంట్లు,  ఫైర్​ యాక్సిడెంట్స్​ జరిగితే తీసుకుంటున్న చర్యలు, ల్యాబ్​ల్లో ఉన్న టెక్నీషియన్ల నైపుణ్యం.. తనిఖీ చేశారు.  

రూల్స్​ ప్రకారం లేని 8  హాస్పిటళ్లను సీజ్ చేసి మరో21 హాస్పిటళ్లకు నోటీసులు అందించారు. డిప్యూటీ డీఎంహెచ్​వో  సుకృత, ప్రోగ్రాం ఆఫీసర్లు బాలాజీ, చైతన్య,  హర్షనాయక్​, డిప్యూటీ డెమోలు ఫయాజ్​ మొయినుద్దీన్​, నాగలక్ష్మి, సీహెచ్​వోలు  తదితరులు 
పాల్గొన్నారు.