- ఉదయం 9 -11 గంటల మధ్య
- 2 గంటల పాటు విధుల బహిష్కరణ
పద్మారావునగర్, వెలుగు : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని వైద్యసేవలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్గాంధీ (టీజీజీడీఏ) యూనిట్ ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విధులను బహిష్కరించి, ఆందోళన చేయనున్నట్టు యూనిట్ జనరల్సెక్రటరీ డాక్టర్ భూపేందర్ రాథోడ్ చెప్పారు.
ప్రభుత్వ డాక్టర్లకు రావాల్సిన యూజీసీ పీఆర్సీ ఏరియర్స్, ఈఎల్ఎన్ హెన్స్మెంట్, టీఏ, ప్రొఫెసర్ల సీఏఎస్, స్టాఫ్ స్ర్టెంథనింగ్ ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కూడా పాల్గొనాలని కోరారు.