
లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకెళుతోంది. కేవలం యంగ్ హీరోలతోనే కలిసి నటించడం కాకుండా.. సీనియర్స్కు జంటగానూ ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కెరీర్కు ప్లస్ అవుతోంది. తాజాగా కోలీవుడ్ స్టార్ విక్రమ్కు జంటగా ఆమె ఓ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. మండేలా, మావీరన్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు మడోన్ అశ్విన్.. విక్రమ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. విక్రమ్ కెరీర్లో ఇది 63వ చిత్రం. ఇందులో హీరోయిన్గా మీనాక్షిని నటించనుందని, ఇటీవలే ఆమె ఈ సినిమాకు సైన్ చేసిందని కోలీవుడ్ టాక్.
అయితే టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇక ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తిక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్లో ఆమె నటిస్తోంది. ఇందులో మీనాక్షి ఆర్కియాలజిస్ట్గా నటిస్తోంది. అలాగే నవీన్ పొలిశెట్టికి జంటగా ‘అనగనగా ఒక రాజు’లోనూ హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికి తెలుగుతో పాటు తమిళంలోనూ సక్సెస్ జెండా ఎగరేయాలనే ప్రయత్నంలో ఉంది మీనాక్షి.