మందులు కొనడానికి వచ్చి సరదాగా లాటరీ టికెట్ కొన్న వ్యక్తి బంపర్ ప్రైజ్ కొట్టేశాడు. అవును కొందరి జాతకంలో అకస్మాత్తు ధనలాభం అంటూ ఉంటుంది. అంటే ఇలానే ఏదో లాటరీ రూపంలో ఏకంగా వారి ధరిద్రం తీరిపోయేలా డబ్బుల వర్షం కురుస్తుందని అర్థం. అయితే కొందరు వీటని పట్టించుకోరు. అదృష్టం ఉంటే వచ్చి తగలకుండా ఎక్కడకు పోతుంది. అప్పటివరకు మనం మన చేసుకుందాం అంటారు. అయితే కోందరు మాత్రం తాము ఏ పనిచేస్తున్నా.. తమఅదృష్టాన్ని మాత్రం అనుక్షణం పరీక్షించుకుంటూనే ఉంటారు. అలాంటి వ్యక్తి ఏకంగా రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది.
పంజాబ్లోని ఓ రైతుకు జాక్ పాట్ తగిలింది. హోషియార్పూర్కు చెందిన ఓ రైతుకు అదృష్టం వరించింది. మహిల్పూర్ నగరానికి చెందిన శీతల్ సింగ్ అనే వ్యక్తి మెడిసిన్ కొనేందుకు మెడికల్ స్టోర్కు వెళ్లాడు. ఆ తర్వాత లాటరీ టికెట్ కూడా కొన్నాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆ రైతుకు ఓ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు. లాటరీ నిర్వాహకులు ఆ రైతుకు కాల్ చేసి మీరు రెండున్నర కోట్లు గెలుచుకున్నారని చెప్పారు. కానీ రైతు నమ్మలేదు. మళ్ళీ మళ్ళీ కాల్ చేసి లక్కీ డ్రాలో మీరు కొన్న టికెట్ వచ్చిందని చెప్పడంతో సదరు రైతు ఆనందానికి అవుదుల్లేకుండా పోయింది. దీంతో లాటరీలో వచ్చిన మొత్తాన్ని ఏమి చేయాలో తన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని లాటరీ నిర్వాహకులకు చెప్పాడు. రైతుకు పెళ్లయిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను 15 ఏళ్ల నుంచి లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్నానని, గతంలో ఇద్దరు కోట్లాది రూపాయలు గెలుచుకున్నారని, ఇప్పుడు శీతల్ సింగ్ గెలుచుకున్నాడని లాటరీ టికెట్లు అమ్మే వ్యక్తి తెలిపాడు.