సీజనల్​ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలని ఆఫీసర్లతో మీటింగ్​

సీజనల్​ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలని ఆఫీసర్లతో మీటింగ్​

మెదక్​ టౌన్​, వెలుగు : సీజనల్ వ్యాధుల పట్ల సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అలర్ట్​గా  ఉండాలని మెదక్​ కలెక్టర్​ రాజర్షి షా, మెదక్​, అందోల్​ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్​రెడ్డి, క్రాంతికిరణ్​ కలిసి శుక్రవారం కలెక్టరేట్​లోని మీటింగ్​ హాల్​లో ఆఫీసర్లతో మీటింగ్​ ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్​, ఫైలేరియా, డెంగీ, చికున్ గున్యా, వైరల్ ఫీవర్ గురించి మాట్లాడారు. మెదక్ నియోజకవర్గంలో మూడు డెంగీ పాజిటివ్ కేసులు రాగా, దుబ్బాక నియోజకవర్గంలో రెండు, అందోల్ నియోజకవర్గంలో ఒకటి కేసు, నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక కేసు నమోదయ్యాయని తెలిపారు.

ఈ కేసుల విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ప్రతి శుక్రవారం డ్రై డే  నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్​వో చందూనాయక్, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్​ డాక్టర్​ నవీన్​,  సహాయ మలేరియా అధికారులు కుమారస్వామి, విజయేందర్, కమ్యూనిటీ హెల్త్ అధికారి రహీం పాషా ఉన్నారు. 

అన్ని రకాల కేసులపై దృష్టి సారించాలి 

మెదక్​ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల కేసుల్లో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్​ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లోని మీటింగ్​హాల్​లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ గత మూడు నెలల్లో 16 కేసులు నమోదు కాగా 8 కేసులు పెండింగ్ ట్రయల్స్​కు, మరో  8 కేసులు ఇన్వెస్టిగేషన్ జరుగతున్నాయని తెలిపారు. ఈ కేసులను ఈనెలాఖరులోగా ఇన్వెస్టిగేషన్​ పూర్తి చేసి చార్జిషీట్​ దాఖలు చేయాలని సూచించారు.

ఎస్పీ మాట్లాడుతూ ఎఫ్​ఐఆర్​తో పాటు బాధితులకు రావాల్సిన ఆర్థిక సహాయం వెంటనే మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సరైన ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కంపెన్సేషన్​ త్వరగా మంజూరయ్యేలా చూడాలన్నారు. అట్రాసిటీ కేసుల విషయంలో చార్జిషీట్​ పూర్తయిన కేసులన్నీ కోర్టులో త్వరగా ప్రవేశపెట్టి హియరింగ్​ వచ్చేలా చూడాలని చెప్పారు.

ఈ సందర్భంగా డీవైఎంసీ సభ్యులు పలు సూచనలు చేశారు. సివిల్ రైట్స్ డేలను ప్రతినెలా చివరి రోజున  ప్రతి మండలంలో ఒక గ్రామంలో జరుపాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు విజయలక్ష్మి, జయరాజ్, మెదక్​ డీఎస్పీ సైదులు పాల్గొన్నారు.