Varun Tej: పిఠాపురం చేరుకున్న వరుణ్ తేజ్.. బాబాయ్ పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం

Varun Tej: పిఠాపురం చేరుకున్న వరుణ్ తేజ్.. బాబాయ్ పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) పిఠాపురం చేరుకున్నారు. ఈరోజు ఉందయం హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్లిన ఆయన అక్కడి నుండి బై రోడ్ పిఠాపురం వెళ్లారు. అనంతరం తన తల్లితో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక పూజలు నిర్వహించారు. అంతేకాదు.. ఈ రోజు తల్లి పద్మజతో కలిసి పిఠాపురంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం చేయనున్నారు వరుణ్ తేజ్.

గొల్లప్రోలు మండలం  కొడవలి, తాటిపర్తి, చందుర్తి గ్రామంలో బైక్ ర్యాలీ, రోడ్ షో లో పాల్గొననున్నారు వరుణ్. అనంతరం..  దుర్గాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే.. పిఠాపురం ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ ఇద్దరి రాకపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.