- మణిపూర్ అంశంపై చర్చకు డిమాండ్
న్యూఢిల్లీ: మణిపూర్లో గొడవలపై చర్చించాలని ప్రతిపక్షాల సభ్యులు రాజ్యసభలో గురువారం డిమాండ్ చేశారు. ఈ విషయంపై రూల్ 167 కింద చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ను ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థించారు. చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ సభలో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన ఖర్గే.. ప్రధాని సభకు వస్తే ఏమవుతుంది? ఆయనేం దేవుడు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నం 2 గంటలదాకా చైర్మన్ వాయిదా వేశారు.
అంతకుముందు అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపైమరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నది మీరంటే మీరని నినాదాలు చేశారు. మణిపూర్ అంశంపై ఓటింగ్తో కూడిన రూల్ 267 ప్రకారం చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దీనిపై నోటీసు కూడా ఇవ్వగా.. చైర్మన్ ధన్ ఖడ్ తోసిపుచ్చారు.