హైదరాబాద్, వెలుగు : మానసిక వికలాంగ విద్యార్థులు, ఆటిజంతో బాధపడే వారికి టెన్త్ లో 10 మార్కులు వచ్చినా పాసైనట్లే. అయితే ఇందుకు 50 శాతం అటెండెన్స్ ఉండాలి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే ప్రత్యేక అవసరాలున్న పిల్లలకూ వార్షిక, పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వం పాస్ మార్కులను తగ్గించింది. వారందరీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎగ్జామ్స్ రాయించాలని ఆదేశించింది. 2022–23 అకాడమిక్ ఇయర్ నుంచే ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
లెప్రసీ నయమైన వ్యక్తులు, కండరాల బలహీనత, యాసిడ్ దాడి బాధితులు, బ్లైండ్, తక్కువ కంటిచూపు, చెవిటి, సరిగా వినిపించని వారికి, మూగ తదితర వైకల్యమున్న స్పెషల్ కేటిగిరి స్టూడెంట్లకు టెన్త్లో పాస్ మార్కులను 35 నుంచి 20కి తగ్గించారు. 3 లాంగ్వేజీల్లో ఒకటి మినహాయింపు ఇచ్చారు. ఈ కేటగిరి స్టూడెంట్లకు పరీక్ష సమయం ప్రతి గంటకు అదనంగా 20 నిమిషాలు కేటాయించాలని ఆదేశించారు.