హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 7 నుంచి 18 వరకు హైదరాబాద్లో నిర్వహించే సరస్ మేళా 2026లో మెప్మాకు పది స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం దక్కినట్లు మెప్మా ఎండీ దివ్య దేవరాజన్ గురువారం తెలిపారు. వీటితో పాటు ఒకటి లైవ్ ఫుడ్ స్టాల్ ఏర్పాటుకు చాన్స్ దక్కినట్లు చెప్పారు. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరికి చెందిన మహిళా పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెప్మా పరిధిలో ఎస్హెచ్జీల నుంచి ఎంపిక చేయబడిన మహిళలు అక్టోబర్ 6వ తేదీ సాయంత్రంలోగా అంబేడ్కర్ విగ్రహం ప్రక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ కు చేరుకొని రిజిస్ట్రేషన్ కమిటీకి రిపోర్ట్ చేయవలని ఉంటుందన్నారు.
తమకు కావలసిన వంట సామాగ్రి, మెనూ వివరాలను అక్టోబర్ 2 లోపు తెలియజేయాలని, గ్యాస్ సిలిండర్, ఇతర సామాగ్రి అద్దె ప్రాతిపదికన ఇక్కడ అందచేస్తారని తెలిపారు. అర్హులైన మహిళా పారిశ్రామికవేత్తల వివరాలను నిర్ణీత ఫార్మాట్ లో పూర్తి చేసి ఈ నెల 20వ తేదీలోపు పంపించాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లను, జీహెచ్ఎంసీ, ఎమ్ఎమ్సీ, సీఎమ్సీ అడిషనల్ కమిషనర్లను మెప్మా ఎండీ దివ్య దేవరాజన్ ఆదేశించారు.
