
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సెడెజ్ బెంజ్ గురువారం ఇండియన్ మార్కెట్లో జీ400 డీ అడ్వెంచర్ ఎడిషన్, జీ 400 డీ ఏఎంజీ లైన్ వేరియంట్లను లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 2.55 కోట్ల నుంచి మొదలవుతాయి.
టాప్ ఎండ్ కార్లకు మంచి డిమాండ్ కనిపిస్తోందని మెర్సెడెజ్ బెంజ్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. అక్టోబర్ – డిసెంబర్ క్వార్టర్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ రెండింటితో పాటు జీ63 ఏఎంజీ, ఎస్ క్లాస్ మేబ్యాచ్ 600 మోడల్స్ కూడా కంపెనీ టాప్ ఎండ్ వేరియంట్లలో ఉన్నాయి.