ఉదయం 6 గంటల నుంచే మెట్రో సర్వీసులు..

ఉదయం 6  గంటల నుంచే మెట్రో సర్వీసులు..

జూబ్లీ బస్ స్టేషన్ (జె.బి.ఎస్), మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎం.జి.బి.ఎస్) మధ్య కారిడార్ II లో మెట్రో రైలు సమయాలను ఉదయం 6 నుండి రాత్రి 11 గంటలకు మార్చినట్లు అధికారులు వెల్లడించారు.  

ఇంతకుముందు, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో మెట్రో కారిడార్‌ను దాటుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా టైమింగ్స్ ఉదయం 6:30 నుండి రాత్రి 11 గంటల వరకు ఉండేవి. సవరించిన షెడ్యూల్ జులై 13 నుండి అమలులోకి వస్తుంది. 

హైదరాబాద్​ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం అధికారులకు టాస్క్ గా మారింది. ఆఫీసు వేళల్లో మెట్రోల్లో విపరీతమైన రద్దీ నెలకుంటోంది.