జూబ్లీ హిల్స్ అంటేనే కాంగ్రెస్కు కంచుకోట! : మెట్టు సాయి కుమార్

జూబ్లీ హిల్స్ అంటేనే కాంగ్రెస్కు కంచుకోట! : మెట్టు సాయి కుమార్
  • ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీ హిల్స్ అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట అని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి 30 వేలకుపైగా భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

సీఎం రేవంత్​ రెడ్డి గురించి ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. అబద్ధాలు మాట్లాడటంలో బీఆర్ఎస్​నాయకులు బీజేపీ వాళ్లను మించిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్​ రెడ్డి సారథ్యంలో ఇంకా పదేండ్లు కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పారు.