
హైదరాబాద్, వెలుగు: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా హైదరాబాద్ బంజారాహిల్స్లో తమ నూతన ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎంజీ సెలెక్ట్ను ప్రారంభించింది. 'రీఇమాజినింగ్ లగ్జరీ' ఫిలాసఫీ ఆధారంగా ఈ కేంద్రం అత్యాధునిక పర్సనలైజ్డ్ సేవలను అందించనుంది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంజీ సెలెక్ట్ తాత్కాలిక అధిపతి మిలింద్ షా మాట్లాడుతూ, ఎంజీ సైబర్స్టర్, ఎంజీ ఎం9 మోడళ్లకు హైదరాబాద్లో అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు.
సైబర్స్టర్, ప్రెసిడెన్షియల్ లిమోసిన్ ఎం9లను ఇక్కడ ప్రదర్శిస్తున్నామని చెప్పారు. బుకింగ్స్ను కూడా ప్రారంభించామని ప్రకటించారు.