జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం

జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం

కారులో ప్రయాణిస్తున్న నలుగురి మృతి

జగిత్యాల: కోరుట్ల మండలం వెంకటాపూర్ దగ్గర అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  మృతులు మల్లాపూర్  కి చెందిన రమాదేవి(29), లత(30), శృతి(2),చరణ్(4) గా గుర్తింపు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు. సారంగపూర్ మండలం పెంబట్ల వెళ్లిన కుటుంబ సభ్యులు రాత్రి జగిత్యాల నుండి మల్లాపూర్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్లు సమాచారం.