పేట్ బషీర్ బాద్ లో  అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

పేట్ బషీర్ బాద్ లో  అర్ధరాత్రి  రోడ్డు ప్రమాదం

కుత్బుల్లాపూర్ : పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.  ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు. బహదూర్ పల్లి నుండి దూలపల్లి కి వెల్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు గుద్దుకుంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి స్వల్పంగా గాయపడ్డారు. మృతుడు  బహదూర్ పల్లికి చెందిన ఎలుగారి బాలకృష్ణ   గా గుర్తించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.