అంటువ్యాధులు.. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని మనకు తెలుసు. సాధారణమైందే అనుకుని భావించే ఈ అంటువ్యాధుల వల్ల లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని మీకు తెలుసా.. తాజా అధ్యయనం ఒకటి ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. లాన్సెట్ పత్రికలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో ఏటా 30 లక్షల మంది పిల్లలు, టీనేజర్లు, యువకులు అంటువ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ప్రతి 10 సెకన్లకు ఒక మరణం సంభవిస్తోంది. ఇండియా, నైజీరియా, పాక్లలో అంటువ్యాధి మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.
అత్యధికాదాయం కలిగిన దేశాల్లో 6 శాతం డెత్లు సంభవిస్తుండగా.. ఎక్కువగా అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోనే నమోదవుతున్నాయి. అంటువ్యాధుల్లో ముఖ్యంగా నీళ్ల విరేచనాలు, న్యుమోనియా, మలేరియా బాలల్లో ఎక్కువగా ఉంటుండగా.. యువతలో హెచ్ఐవీ, క్షయ మరణాలకు దారి తీస్తున్నాయి. 2020లో కరోనా వైరస్ వ్యాధి ప్రబలడంతో ఈ అంటువ్యాధులపై జరిపే రిసర్చ్లను చాలా దేశాలు పెంచాయి.